అనుచరులు

29.8.13

అసమర్థుని జీవయాత్ర

చాలా రోజుల తరువాత తెలుగు నవల చదవాలనిపించి, పుస్తకం కోసం వెతుకుతుంటే అసమర్థుని జీవయాత్ర అనే ఈ నవల గురించి తెలిసింది.త్రిపురనేని గోపీచంద్ రాసిందీ నవల.ఈ పుస్తకం చదివాకా నాకు పుట్టుకొచ్చిన చిరాకు అంతా ఇంతా కాదు!ఈ కధాంశం నుండి పాఠకులేం తెలుసుకోవాలని రచయిత కోరుకున్నాడో నాకర్ధం కాలేదు.సీతారామారావు ఈ నవలలో కధానాయకుడు! కాదు కాదు కధానయకుడనడానికి లేదు, ముఖ్య పాత్ర!
వీడంత వెధవ ఇంకోడు ఈ భూమి మీద ఎక్కడా పుట్టి ఉండడు,పుట్టడు (కనీసం ఊహల్లో కూడా పుట్టడు!)అని మొదటి నాలుగైదు కాగితాలు తిరగేస్తేనే అర్థమైపోతుంది.వీడికి మనుషులు నచ్చరు,కుటుంబ వ్యవస్థ నచ్చదు,తల్లిదండ్రులు,అత్తమామలు,భార్యాబిడ్డలు,ఇలా ఏ మానవసంబంధాలూ ఇష్టముండవు.వీడికి పెళ్ళి వద్దట!కానీ ఇంట్లో వాళ్ళను కాదనలేక పెళ్ళాడతాడు.మరి ఇంత పెళ్ళి ఇష్టం లేని వాడూ పెళ్ళం తోనే ఉంటాడు, పిల్లల్ని కంటాడు. కానీ వీడికి ఎవరన్నా ఇష్టం లేదు!వాడి నిరాశానిస్ప్రుహల్లో వాడుంటాడు, చివరికి చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుని చస్తాడు.అదీ స్మశానంలో ఆత్మహత్య!

అసమర్థులూ,నిరాశావాదులూ,తమ ఈ అశక్తతను అధగమించడం ఎలాగో చెప్పడం మానేసి,ఒక విషాదభరిత,విషపూరిత కధాంశాన్ని పాఠకులకు అందించడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో??