అనుచరులు

1.9.10

మన తెలుగు... మన గిడుగు


తెలుగు భాషకు సేవలందించిన మహానుభావులు ఎందరో...ముందుగా వారందరికి నా వందనాలు. ఒక వారం పది రోజుల నుంచీ ఒంట్లో నలతగా ఉండటం వలన మిమ్మల్ని కలవలేక పోయాను. సరిగ్గా ఈలోపే మన మాత్రుభాషా దినోత్సవం కూడా అయిపోయింది. 29వ తేదీన వ్రాయదలచింది ఇప్పుడు రాస్తున్నాగా..
ఆది కవి నన్నయ, విశిష్ఠ శబ్ద ప్రయోగముల చేత శబ్ద శాసనుడిగా బిరుదు పొందినా, శ్రీనాథుడు ప్రబంధ కవితలతో కవి సార్వభౌముడైనా, కాలాంతరంలో వీరి రచనలు పామర రంజకాలు కాలేక పోయాయి. పర దేశీయుల పాలనలో మనం ఉన్నప్పటికీ, కొందరు ఆంగ్లేయులు తెలుగు భాష మీద మక్కువ పెంచుకున్నవారు లేకపోలేరు. వ్యవహార భాషకూ, గ్రాంధికానికి ఉన్న తేడాను సామాన్య ప్రజలు పెద్దగా ఎత్తి చూపకపోయినా, ఈ దొరలు మాత్రం భాషాంతరాన్ని ప్రశ్నించారు. ఈ వరుసలో వ్యవహార భాషొద్యమానికి బీజం వేసిన వానిగా జె. ఎ. ఏట్స్ దొరని చెప్పుకోవాలి. దొర గారి ప్రశ్నకు సమాధానంగా గురజాడ, గిడుగు, పి.టి. శ్రీనివాస అయ్యంగార్ల త్రయం శిష్ట వ్యవహారిక భాషను బోధనాంశాలకు మాధ్యమంగా వాడాలని వ్యవహార భాషొద్యమానికి తెర తీశారు. అయితే గిడుగు రామమూర్తి పంతులు ఉద్యమాన్ని ప్రజలకూ, ప్రభుత్వానికి దగ్గరగా తీసుకెళ్ళారు. ఈ క్రమంలో తెలుగు అనే మాస పత్రికను కూడా నడిపారు. కేవలం తెలుగుకే కాక సవర అనే కొండ తెగ భాషకు విశిష్ఠ సేవలందించి, రావు బహదూర్ బిరుదు పొందారు గిడుగు వారు. వ్యవహార భాష కు ఇంతగా క్రుషి చేసిన గిడుగు వారి జన్మదినమైన 29.ఆగష్టున తెలుగు మాత్రుభాషా దినోత్సవం గా జరపుకోవడం నాకు చాలా ఆనందకరం. మీ అందరికీ మాత్రుభాషా దినోత్సవ శుభాకాంక్షలు. అన్నట్టు చివరిగా...గిడుగు వారు తూర్పు గోదావరి జిల్లా లోని తెలుగు భాషే ప్రామాణికముగా తెలిపారు. అంటే మాది రాజమండ్రి లెండి. కొంచెం స్వార్ధం.ఆయ్...మరి ఇంక ఉంటానండి.

కామెంట్‌లు లేవు: