అనుచరులు

10.9.10

వేయి పడగల విశ్వనాథుడు


గోవులు తెల్లన..గొపయ్య నల్లన..(సప్తపది) అనే పాట రచనకు వేటూరి వారికి స్పూర్తి విశ్వనాథ సత్యనారాయణ రచనే అని చాలా సార్లు చెప్పారు.వేటూరి పైన నాకున్న అభిమానం చేత విశ్వనాథ వారి రచన ఏదైనా చదవాలనుకున్నాను.అలా చదివినదే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి మరియూ ఆంధ్ర విశ్వకళా పరిషద్పురస్కారాన్నందుకున్న "వేయి పడగలు".ఈ నవల 1920 ల కాలంలో మొదలయ్యి, స్వాతంత్ర్య పోరాట కాలం వరకూ సాగుతుంది.మొత్తం గ్రాంధిక భాష లో ఉంటుంది.ఈ తరం వారికి అర్ధం అవటం కష్టం.భారత దేశపు ఆత్మ అయిన భిన్నత్వం లో ఏకత్వం,ఏకత్వం లో భిన్నత్వం అన్నది ఏదైతే ఉందో,దానికి హైందవ ధర్మ శాస్త్రాన్ని జోడించి ఈ వేయి పడగలు కి పునాది వేశారు.కథా వస్తువు ఏదైనప్పటికీ ఈ పుస్తకం చదవటం వలన భాషాభివ్రుధి ఖాయం.మానవ సంబంధాల సున్నితత్వాన్ని,గాఢతను రామేశ్వర శస్త్రి భార్యల మధ్యా,సంతానం మధ్యనా చెబితే,భార్యా భర్తల బంధాన్ని ధర్మారావు-అరుంధతి పాత్రల ద్వారా చెప్పారు.వీటన్నిటికన్నా చిన్న జమిందారు-ధర్మారావు-గిరికల బంధం చిత్రమనిపిస్తుంది.పసిరిక పాత్ర ఒక వింత.ముఖ్యంగా నేను జమిందారీ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను.అలాగే స్నేహ బంధాలు బాగా చెప్పారు. ఆనాటి దేశ కాలధర్మ పరిస్థితి ఏమిటో,స్వధర్మాన్ని పరిత్యజించి పాశ్చాత్య నాగరికతానుసరణ వల్ల వచ్చే నష్టాలేమిటో,జమిందారు పాత్ర ద్వారా చెప్పబడింది.ఆధునికత మోజులో పడి, ప్రక్రుతి అందాలను మనం ఎలా కోల్పోతున్నామో చక్కగా వివరించారు.మురుగు నీరు సమస్యలూ,కంకర వల్ల వచ్చే అధిక వేడీ,వాతావరణం లో మార్పులూ కొన్ని పాత్రల ద్వారా చెప్పించారు విశ్వనాథ వారు.ఈ సమస్యలను మనం,ఈ కాలం పూర్తి స్థాయి లో అనుభవిస్తున్నాము.అన్నింటి కన్నా ముఖ్యంగా ధర్మా రావు పాత్ర చేత విశ్వనాథ వారు అనేకానేక సాహిత్య ప్రక్రియలను,వ్యాకరణాంశాలను మనకు పరిచయం చేయటం నాకు నచ్చిన అంశం. అంతే కాక గణాచారి పాత్ర కూడ బాగుంటుంది. కధలో మలుపు రాబోతున్న విషయం పాఠకులకు ఈ పాత్ర ద్వారా సూచించడం జరుగుతుంది. మూఢ నమ్మకాలకూ, సనాతన సాంప్రదాయాలకూ, అధునికతకూ, ఇలా అన్ని అంశాలకు ఈ వేయిపడగలలో స్థానం కల్పించారు రచయిత. ఈ పుస్తకం గురించి చెప్పుకుంటూ పోతే, అదే రాసుకుంటూ పోతే పడగకో కాగితం చప్పున నేను వేయి కాగితాలు రాయాల్సొస్తుంది. అందుకే ఇక చాలు. విశ్వనాథ సత్యనారాయణ గారి "రామాయణ కల్పవ్రుక్షము" తెలుగు వారి ఇంటికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ ఇప్పుడు "వేయి పడగలు" ఎందుకు తలచుకున్నానో రాయాలిగా...ఈ రోజు విశ్వనాథ సత్యనారాయణ గారి పుట్టిన రోజు!

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

I like him very much.

Actually compare to "Geethanjali" "Thousand Woods of Serpent"(Veeyi Pdagalu) is eligible for noble prize.

We have to celbrate his birthday. But unfortunately none of the media or press covered his birthday. Very sad.

Happy birthday to Satyam sir.

Saahitya Abhimaani చెప్పారు...

Thanks for an excellent photo of Shri Viswnatha

శ్రీ సౌమ్య చెప్పారు...

ధన్యవాదాలు శివ గారు!