అనుచరులు

22.2.11

రామాయణ విషవ్రుక్షం-ఇదే ఒక విషవ్రుక్షం!


రంగనాయకమ్మ రామాయణ విషవ్రుక్షం అని ఒక పుస్తకం వ్రాసి జనం మీదికొదిలింది. కాని ఆమె బాధేంటో నాకైతే అర్ధం అవలేదు. 3 సంపుటాలూ కలిపి ఒకే పుస్తకం లో ఆ మధ్య ఎప్పుడో మళ్ళీ అచ్చేశారెవరో. తనని తాను గొప్ప రచయిత్రి అనుకునే ఈవిడ ఒక్క 85 ఎన్నో కాగితాలు మాత్రమే కలిగిన పీఠిక వ్రాసింది!!!
ఆమె ద్రుష్టిలో రామయణం ఒక విషం, రాముడు అన్న వాడు కపటి ....ఇలా ఇంకేవో అద్భుతమైన గొప్ప ఆలోచనలు ఉన్న ఆదర్శ మూర్తి, రంగనాయకమ్మ. ఇప్పుడు జనమందరూ రాముడు దేవుడంటే ఈవిడకొచ్చిన నష్టమేమిటో??
రాముడన్న వాడు ఉన్నాడా లేడా అన్నది అనవసరం. రాముడంటే మనము కొన్ని సుగుణాలకు ప్రతీక గా భావిస్తున్నము. అంటే ఏక పత్నీవ్రతుడు, సత్యవంతుడు, వీరుడు, ఇలాగనమాట. అంతే తప్ప ఎప్పుడో రాజ్యం చేసిన రాజును ఇన్ని యుగాలైనా గుర్తుంచుకుని బానిసల్లగా, గొర్రెల మందల్లాగా, మన పెద్దలు చెప్పారని పూజించటంలేదే!
సరే, రాముడన్న వాడు వాల్మికి స్రుష్టి అనుకుందాము. అప్పుడైనా ఒక సుగుణ రాశిగా వర్ణించిన ఒక పాత్రను గుర్తుంచుకుని ఆ సుగుణాలను రాముడన్న దేవుని పేరుతో జనం ఆరాధిస్తే తప్పేమిటి? మా సంస్క్రుతం అధ్యాపకులు నాకు రమేతాం ఇతి రామాః అని చెప్పేరు. అంటే ఆనందము కలిగించు వాడు రాముడు. రాముని పాత్ర మరి సర్వ జన రంజకముగా ఉంటుంది. ఆనంద స్వరూపుడే గా భగవంతుడు! అప్పుడు అనందము కలిగించువాడు దేవుడే! అలాగని పక్క వారిని బాధపెట్టి ఆనందించేవాడు దేవుడని విపరీత బుద్ధి ప్రయోగము చేస్తే అది కేవలం పైత్యం! సర్వకాల సర్వావస్థలలో ఎల్లరుకూ మంచి చేస్తూ, సన్మార్గదర్శకముగా ఉంటూ, ఆనంద ప్రదాయికముగా ఉండే లక్షణములను దేవుడన్నారు గానీ, దేవుడంటే ఎక్కడో ఆకశం లో కుర్చుని, సినెమాల్లో చూబించినట్టుండడు! కాబట్టి ఈనాడు మనం రాముడన్న పేరుతో ఆరాధిస్తున్న సుగుణాలు ఖచ్చితం గా దైవీ లక్షణాలు! ఇందులో మరి ఈ రంగనయకమ్మకు వచ్చిన అడ్డమేమిటో. అంటే, అందరూ బహు భార్యలతో కూడీ, జూదమాడుతూ, వ్యసనపరులై, సుగుణాలను దూషిస్తూ ఉంటే సమ సమాజం, నవ సమాజం వచ్చేసినట్టా? అందరూ ఉద్ధరింపబడతారా?
పైగా ఈ పుస్తకం యువతకు ఎంతో అవసరమని ఈవిడ అభిప్రాయం. ఏ విధంగానో? స్వనింద-పరస్తుతి ఎంత హానికరమో, పరనింద-అహంకారం కూడా అంతే హానికరం. వాల్మికిని కావ్య కర్తగా హేళన చేసే ముందు, ఈమె సామర్ధ్యం ఏమిటో తెలుసుకున్నదా? కేవలం ఒక రచన మీద వ్యాఖ్యగా కాక, జనానికి సుగుణాల మీద ఉన్న నమ్మకాన్ని హత్య చేయలన్న ఉద్దేశం గల దారుణమైన రచన ఇది! రామయణాన్ని వక్రీకరించి చూపిస్తే జనంలో వచ్చే మార్పేమిటి?
రాముడే చెడ్డవాడైతే, ఇక ఆయన గుణాల మీద ప్రజలకున్న నమ్మకము పోయి అందరూ, వివేక హీనులై వ్యసనపరులవుతారు! నష్టపోయేది ఎవరు? యావద్భారత దేశము. ప్రపంచ దేశాలన్నీ గొప్పగా తలెత్తి చూసే మన కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోతుంది. నిజంగానే రంగనాయకమ్మ విషవ్రుక్షాన్ని నాటింది!! మనందరి నైతిక విలువలనూ చంపిపారేశే విషం కక్కే వ్రుక్షం ఆమె వ్రాసిన ఈ మహాగ్రంధము!!

3 కామెంట్‌లు:

www.tollywoodtv.com చెప్పారు...

Mana samskruthi sampradaayaala thulasi vanamlo yilaanti ganjaayi mokkalu chaalane vunnaayi. Yaarlagadda vaari "Droupadi" navala koodaa yeekovake chenduthundi. Addaala medapai raayi vesthe pichchodu koodaa padimandi drustilo padathaadu. Veellu koodaa alaante vaalle.

అజ్ఞాత చెప్పారు...

There are two kinds of people are there in this world. One those who have "divine qualities" belive in god and those have anti divine qualities hate/disbelive in god. Now a days, due to some reasons and kaliyuga, anti god elements/qualities are increasing in people. If any person says that there is no god irrespective of his/her religion, then it is true that he/she is influenced by anti god elements. This is 100% true.

అజ్ఞాత చెప్పారు...

Dhyva dhooshanam mahapaapam .ramudu ani kadu yesu allah a dhevudu aina sare.avari matham varidi avari manobaavalanu kinchaparchaddu.