అనుచరులు

15.3.11

చెలియలి కట్ట

చెలియలి కట్ట చదవగానే, చలం మైదానం( పరిచయమున్నవారికి) స్ఫురించడం లో ఆశ్చర్యం లేదు. మైదనం కి విశ్వనాథ వారు వేసిన అడ్డుకట్ట ఈ చెలియలి కట్ట.ఈ రెండు కథలకూ నాయిక భర్తను విడిచి పరాయి వాడితో వెళ్ళిపోవడమన్నది సారూప్యత. కానీ పాత్రల చిత్రీకరణ లో ఏ మాత్రం పోలికుండదు.
మైదానం లో రాజేశ్వరిది ప్రేమరాహిత్యాన్ని అనుభవించే పాత్ర. భర్త దగ్గర తాను పొందలేని ప్రేమను వేరొకరి దగ్గర వెతుక్కుంటూ, సమాజపు కట్టుబాట్లను ఎదిరిస్తుంది.అమీరు తో కలిసి మైదానం లో విచ్చలవిడిగా బ్రతికి నాశనమవుతుంది. తన నిర్ణయాలకు పర్యవసానం ఏదైనా సరే పశ్చాత్తాపపడదు.సమాజాన్ని మాత్రం నిందిస్తూ ఉంటుంది.
ఇహ, చెలియలి కట్ట రత్నావళి అమాయకత్వం చేత, మరిది రంగడి చెప్పుడు మాటలకు లోబడి అతనితో వెళ్ళిపోతుంది. ఇక్కడ చిత్రమేమిటంటే రంగడు కూడా కొందరి విప్లవ భావజాలానికి లోబడి ఆవేశం లోనే ఈ పని చేస్తాడు. తను వదినగారికి మేలు చేస్తున్నానన్న ఉద్దేశ్యం లో ఉంటాడు రంగడు.
కధాగమనం లో రంగడు, రత్న కోరిన విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తాడు. ఇదే గాక, రంగడి స్నేహితులతో రత్న పరిచయం , పరాభవం మొదలైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమం లో రత్న స్వాధ్యాయం చేసుకోవడం మొదలెడుతుంది. చివరిగా ముకుందరావు దగ్గర విద్యాభ్యసం ఆమెకు కొత్త ఉత్తేజాన్నీ, విచక్షణా శక్తిని ఇస్తుంది.తెలుగు విదూషిగా ఒక పాఠశాలలో సంపాదన ఆరంభిస్తుంది. అలాగే రంగడు చదువు సాగక, ఉద్యోగంలో చేరి, సంపాదిస్తుంటాడు.కొన్నాళ్ళిలా గడిచినా, వీరిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయముండదని చెప్పటానికి రచయిత అద్భుత తర్కాన్ని ఆవిష్కరించారు.కధ సాగుతున్న కొలదీ, రత్నకు, దూరమైన బంధువులు ఎదురవడం, భర్తైన సీతారామయ్య మళ్ళీ పెళ్ళాడి, కొడుకును కన్నాడని తెలియడం జరుగుతుంది. రంగడు కూడా తాను చేసింది తప్పని కుంగిపోతుంటాడు. కష్టమైనా, సుఖమైనా రత్న చేయి వదలకూడదని అనుకుంటాడు. కూడబెట్టిందంతా, మేనల్లుడికి ఇచ్చేస్తాడు.
రత్న కూడా తన డబ్బును భర్త కొడుకు పేరున పెట్టి తనకు ఉత్తరక్రియలు జరిగేట్టు చూడమని భర్త దగ్గర మాట తీసుకుని, చెలియలి కట్ట తెగిపోతున్న సముద్రపు వడ్డున రంగడి తో కలిసి కూర్చుంటుంది. వారి ఆత్మహత్యతో కధ సమాప్తం.
చెలియలి కట్ట తెగితే సముద్రుడు ఎలా ముంచేస్తాడో, ధర్మం దాటితే జీవితం మునిగిపోతుందని చెబుతూ, చలం వంటి వారి భావాలనీ, ఆయన రాసిన మైదానాన్నీ మా విశ్వనాథ వారు ముంచేశారు! ఇందులో సందర్భానుసారంగా బిచ్చగాడి పదాలు చాలా బాగుంటాయి.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

addu kattalu veyadam lo vishvanadha variki sati leru maidanam ki addu katta vesinatte ramayana visha vruksham ki kuda vesaru

అజ్ఞాత చెప్పారు...

Ramayanam visha vriksham was a stupid communist re-interpretation of Ramayanam. It was written after Ramayanam Kalpa vriksham was written and not the other way around. So I am missing the point you are trying to make.

శ్రీ సౌమ్య చెప్పారు...

మీ వ్యాఖ్యను ఈ వ్యాసానికి ఎందుకు ఉంచారో నాకు తెలియలేదు. తెలుగుతీరాల్లో రామాయణ కల్పవ్రుక్షం గురించి నేను పెద్దగా రాసింది లేదు.జ్ఞాన పీఠ్ వచ్చిందని మాత్రమే రాశాననుకుంటున్నా! అయినా విషవ్రుక్ష ఖండనం అనే పుస్తకం ఉందిగా !!