
పల్లవి: నీ నామ సంకీర్తనే నా జన్మ సౌభాగ్యమే,
నీ దివ్య సాన్నీధ్యమే, నిరతిశయానందమే..
చరణం:
1. పరబ్రహ్మ తత్త్వమ్ము పరిపరి విధాలుగ ప్రకటించు ప్రకృతివీ
పరిపూర్ణతకై పురుషుని రూపుగ ఉదయించు శ్రీ శక్తివీ...ఉదయించు శ్రీ శక్తివీ..
2.ఏ కార్య సిద్ధతకు పరమాత్మ దేహాన జీవాత్ముడై వెలిసెనో
ఆ జన్మ సాఫల్య పధమందు నడిపించి నను బ్రోవుమా భగవతి... నను బ్రోవుమా భగవతి
3.నా హృదయ మందిరము నీ స్థిర నివాసముగ వసియించి నన్నేలుమా
నా మనః ప్రాణములు నీ చరణ కమలాలు మన్నించి రక్షింపుమా..మన్నించి రక్షింపుమా..