అనుచరులు

20.1.14

కృష్ణాతీరాన సాహితీయాత్ర-2


చాలా కాలంగా మోపిదేవి చూడాలనుకోవడానికి దైవభక్తే కాక మరొక ప్రత్యేకమైన కారణముంది.మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో ప్రసిధ్ధి. ఆలయం కట్టించినది చల్లపల్లి జమీందారుగారు.ఇది అందరికీ తెలిసినదే.ఐతే మా విశ్వనాధ సత్యనారయణ గారి వేయిపడగలు నవలకు నేపధ్యంగా ఎంచుకున్నది  మోపిదేవి స్వామినీ, చల్లపల్లి రాజుగారినేననీ 

మువ్వగోపాలుడు

పాండురంగాలయం  


 ఆ మధ్య అమ్మమ్మగారు చెప్పారు.ఇక అప్పటి నుంచి మోపిదేవి చూడాలని!! విజయవాడ నుండి మోపిదేవి దోవలోనే శ్రీకాకుళంమంటాడ (వేంకటేశ్వరుడు),చల్లపల్లి (కోట;నేనులోపలికివెళ్ళిచూడటం వీలు అవలేదు),కూచిపూడి (తెలుగు విశ్వవిద్యాలయం,కళాపీఠం,సిద్ధేంద్రయోగి మండపం)వున్నాయి.అన్నట్టు ఏకవీర నవలలో కూచిపూడి నాట్యవిన్యాసము నాకు అలలా గుర్తుకొచ్చింది.అలాగే సుమారు 6 కి.మి.దోవ చల్లపల్లి దగ్గర మారితే మొవ్వ కూడా ఉంది.  మొవ్వ లోనే తెలుగు పదకవిత ప్రాణం పోసుకున్నది. క్షేత్రయ్య పదాలుగా సుప్రసిధ్ధమైన మువ్వగోపాల పదాలను మౌద్గళ్యుడనే పిల్లవాడు కృష్ణపరమాత్మ అనుగ్రహంతో  ఊళ్ళోనే ఆశువుగా ఆలపించాడు.తరువాతి కాలంలో భారతదేశంలోని అనేక క్షేత్రాలను సందర్శిస్తూ మువ్వగోపాలుణ్ణి కీర్తిస్తూ పద్యాలు చెప్పటం వల్ల క్షేత్రయ్యగా పేరొందాడు.ఇంకాస్త దూరం వెళ్తే చిలకలపూడిగా పిలువబడే కీరపురం వుంది.ఇక్కడ కొలువైన కీరపండరినాధుడు స్వయంభువుగా చెప్పబడ్దాడు.  పాండురంగని ఆలయం ఎంత పెద్దదో అంతకన్నా ప్రశాంతమైనది.ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన స్థలమిది.నేను  గుళ్ళో ఉన్నప్పుడు ఒక చిన్న బాబు సుమారు 12 ఏళ్ళవాడు పాండురంగ బారో అంటూ స్వామిని రమ్మంటూ పాడాడండీ, ఆహా వాడి కంఠం!  రోజుకీ తలుచుకోగానే నా చెవిలో మ్రోగుతోంది.గానామృతం!!!  మచిలీపట్నంలో సముద్రతీరం,ఆపైనే హంసలదీవి చక్కటి ప్రదేశం.కృష్ణానది సముద్రంలో కలిసేది హంసలదీవిలోనే!ఇక్కడే చక్కటి కృష్ణాలయం ఉందట.అక్కడి వరకూ వెళ్ళడం నాకు కుదరలేదు.ఇంకెప్పుడైనా వెళ్ళాలి!

కామెంట్‌లు లేవు: