అనుచరులు

4.8.10

ఎందరో మహానుభావులూ.. అందరికీ వందనములు..

ఎందరో మహానుభావులూ అందరికీ వందనములు.. అనే త్యాగరాజ కీర్తన, తెలుగు వారి మర్యాదకూ, ఆదరణకూ చిహ్నం. అందుకే ఈ కీర్తనతో ఆరంభిస్తున్నా.

ఎందరో మహానుభావు-లందరికి వందనములు
ఎందరో మహానుభావులు అందరికి వందనములు

చందురు వదనుని యంద-చందమును
హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమనుభవించు-వా (రెందరో)
చందురు వదనుని అంద-చందమును
హృదయ-అరవిందమున జూచి
బ్రహ్మానందము అనుభవించు-వారు (ఎందరో)

1.సామ గాన లోల మనసిజ లావంయ
ధన్య మూర్ధన్యు (లెందరో)
సామ గాన లోల మనసిజ లావంయ
ధన్య మూర్ధన్యులు (ఎందరో)

2.మానస వనచర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే వా (రెందరో)
మానస-వన-చర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే-వారు (ఎందరో)

3.సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయువా (రెందరో)
సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము-సేయువారు (ఎందరో)

4.పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో
స్వర-లయాది రాగములు తెలియువా-(రెందరో)
పతిత పావనుడు-అనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో
స్వర-లయ-ఆది రాగములు తెలియువారు (ఎందరో)

5.హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో
తెలివితో చెలిమితో కరుణ గల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా-(రెందరో)
హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులు ఇలలో
తెలివితో చెలిమితో కరుణ కల్గి
జగము ఎల్లను సుధా దృష్టిచే బ్రోచువారు (ఎందరో)

6.హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశము గలవా (రెందరో)
హొయలు మీర నడలు కల్గు
సరసుని సదా కనుల జూచుచును పులక-శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశము గల-వారు (ఎందరో)

7.పరమ భాగవత మౌని వర
శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష
కనక-కశిపు సుత నారద తుంబురు
పవన-సూను బాలచంద్ర-ధర శుక
సరోజ భవ భూసుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమలభవ సుఖము సదానుభవులు గాక (యెందరో)
పరమ భాగవత మౌని వర
శశి విభాకర సనక సనందన
దిక్-ఈశ సుర కింపురుష
కనక-కశిపు సుత నారద తుంబురు
పవన-సును బాలచంద్ర-ధర శుక
సరోజ-భవ భూ-సుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమల-భవ-సుఖము సదా అనుభవులు గాక (ఎందరో)

8.నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల
శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్ల జేసినట్టి
నీ మదినెరింగి సంతసంబునను
గుణ భజనానంద కీర్తనము సేయువా (రెందరో)
నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల
శాంత మానసము నీవు-అను
వచన సత్యమును రఘువర నీయెడ
సత్-భక్తియు జనించకను
దుర్-మతములను కల్ల-జేసిన-అట్టి
నీ మదిని ఎరింగి సంతసంబునను
గుణ భజన ఆనంద కీర్తనము-సేయువారు (ఎందరో)

9.భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన-వా (రెందరో)
భాగవత రామాయణ గీతా-ఆది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివ-ఆది షణ్మతముల
గూఢములను ముప్పది-ముక్కోటి
సుర ఆంతరంగముల భావంబులను-
ఎరింగి భావ రాగ లయ-ఆది సౌఖ్యముచే
చిర-ఆయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజ ఆప్తులైన-వారు (ఎందరో)

10.ప్రేమ ముప్పిరి కొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా (రెందరో)
ప్రేమ ముప్పిరి-కొను వేళ
నామము తలచే-వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన-వారు (ఎందరో)

కామెంట్‌లు లేవు: