అనుచరులు

14.8.10

జండా జననం...


ఈ నేల మీద పుట్టిన మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే అది కొన్ని సంవత్సరాల పాటూ కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు, తమ స్వలాభం చూసుకోకుండా సమాజ క్షేమం కోసం చేసిన త్యాగాలే.
ఎందరి వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం
వారందరిని తలచుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు
..... అన్నట్టుగా మనం స్వాతంత్ర్య సమర వీరులందరికీ అర్పించే నివాళి, వారిని తలచుకోవటమే. ఎందరో సమిధలైన ఈ స్వేచ్ఛా యజ్ఞంలో తెలుగువారు గర్వించదగిన వీరులు ఎందరో ఉన్నారు. కత్తి పట్టిన వారు కొందరైతే , కలం పట్టిన వారు కొందరు. అహింస మార్గంలో నడచినవారు ఇంకొందరు. అయితే మన దేశం యొక్క అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటే జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు తెలుగువారవడం, మనం గర్వించాల్సిన విషయం. పింగళి వారు పుట్టినది కూడా ఈ నెల 2వ తేదీనే. బందరు లో పుట్టిన పింగళి వారు, ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత పైచదువులకి కొలొంబొ వెళ్ళారు. భారత దేశం తిరిగివచ్చాకా ప్రభుత్వోద్యోగంలో చేరారు. గాంధీ గారు దక్షిణాఫ్రికా లో తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఆకర్షితులైన పింగళి వారు, తరువాతి కాలంలో కాంగ్రెస్సు పార్టీకి జెండ అవసరమని సూచించారు. అలా మొదటిసారిగా రూపొందినది మువ్వన్నెల జెండా. అయితే కాలాంతరంలో, దీంట్లోని చరకా అశోకచక్రంగా మారి భారత దేశపు జాతీయ పతాకంగా అవతరించింది. మత సామరస్యానికి, సిరిసంపదలకు, అహింసకూ మన జెండాను ఎగరవేసి అప్పుడే 63 వర్షాలు గడిచాయి., అయినా మనం సాధించవలసినది ఎంతో ఉన్నది. మహా వీరుల త్యాగాన్ని గౌరవిస్తూ మనం శాంతి సామరస్యాలతో జీవిస్తూ, బుద్ధుని పుట్టుకకు సార్ధకత చేకూర్చుదాం. భారత మాతకు జయము జయము..........

కామెంట్‌లు లేవు: