అనుచరులు

8.8.10

కీర్తికిరీటాలు

యద్దనపూడి సులోచనారాణి తన నవలా నాయకులను ఆరడుగుల అందగాడిలాగానూ, గిరజాల జుత్తు వాడిగానూ, రింగు రింగు పొగలూదే సోగ్గాడిలాగానూ, బాహ్య సౌందర్యాన్ని వర్ణించినా...ఆమె నాయికను మాత్రం చెక్కు చెదరని ఆత్మాభిమానానికి నిదర్శనంగా చూపుతుంది. యద్దనపూడి వర్ణనలో పాఠకులకు, నాయిక అందచందాల కన్నా కూడా, ఆమె వ్యక్తిత్వమే మనసులో నిలిచిపోతుంది. సెక్రెటరీ, హ్రుదయ గానం వంటి నవలలలో, నాయిక పాత్రలలో ఆత్మాభిమానమే కాక, స్త్రీ సహజమైన అమాయకత్వంతోబాటూ మొండితనం, మూర్ఖత్వం కనబడుతాయి. అయితే ఈ కీర్తికిరీటాలు ఇందుకు కాస్త భిన్నం అనే చెప్పుకోవాలి. కీర్తికిరీటాలు లో నాయకుడు తేజ పాత్ర, నాయిక అయిన స్వర్ణ కన్నా కూడా చాలా గాఢమైనది. తేజ చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరమై, తాతగారింట్లోనే ఉంటూ, మేనత్త పెంపకంలో పెరుగుతాడు. తేజ పెద్దైన కొద్దీ, తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుని, అందులోనే జీవిస్తూ, గిరిజనులకు సాయపడుతుంటాడు. చిననాటి జ్ఞాపకాలను మర్చిపోలేకా, స్వర్ణకు దగ్గర కాలేకా, తేజ పడే బాధే ప్రధానంగా ఉంటుంది. గొప్ప నాట్య మయూరి అయిన స్వర్ణకు జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదురుకునేలా, తేజ ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఎలా కల్గించాడన్నది అసలు కధ అయినా, తేజ తల్లి రాజ్యలక్ష్మి వలనే కధకు పునాది పడుతుంది. రాజ్యలక్ష్మి జీవితాన్ని చిన్నగానే కధ మధ్యలో రచయిత్రి చెప్పినా, ఆమె పడే అంతర్మధనం, మానసిక వేదన కధలో అంతర్లీనంగా ప్రాముఖ్యతను వహిస్తాయి. జీవితం పట్ల ఆశావాహ ద్రుక్పధాన్ని, ఈ నవల చక్కగా ప్రతిబింబిస్తుంది. నేను చదివిన పుస్తకాలలో, ఈ కీర్తికిరీటాలకు ఎప్పటికీ ప్రధమ శ్రేణిలో స్థానం ఉంటుంది. వీలైనప్పుడు మీరు కూడా చదువుతారుగా....

2 కామెంట్‌లు:

Jagadish kocherlakota చెప్పారు...

Aunandi, meeru raasindi aksharaala nijam. Bhava vyaktheekarana maatrame kaakunda vyakthula chitreekarana kooda adbhuthamga kanipinche ekaika navalaaraajam...KEERTHI KIREETALU. I feel very happy to share my feelings with you...Dr Jagadish.

sri sowmya avancha చెప్పారు...

మీ అభిప్రాయం తెలియపరిచినందుకు ధన్యవాదములు!